ఓడిచెరువు మండలంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. మలకవారిపల్లి గ్రామంలో మృతి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు రెడ్డప్ప సోదరుడు చిన్న రెడ్డప్పరెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరై భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అలాగే కొండకమర్ల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి సీనియర్ నాయకులు రహమతుల్లా, ఖాసిం పీరా కుటుంబాలను కూడా మాజీ మంత్రి పరామర్శించారు. మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ మృతులు టిడిపి పార్టీకి, కుటుంబాలకు తీరని లోటు అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అన్ని విధాలుగా కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎలాంటి కష్టకాలంలోనైనా పార్టీ వారి వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news