పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపిస్తూ ఈరని ప్రజ్ఞా వర్ధిని ఎంబిబిఎస్ డాక్టర్గా పట్టా పొందారు. జిల్లెడు చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నతనం నుంచే పట్టుదలతో చదువులో ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
గుర్రంపల్లి గ్రామానికి చెందిన ఈరని చెన్నయ్య, ఈరని నవనీత దంపతుల కుమార్తె అయిన ప్రజ్ఞా వర్ధిని ప్రారంభ విద్యను స్థానిక ఠాగూర్ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం గచ్చిబౌలిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగించారు.
తరువాత హైదరాబాదులోని ఎస్సార్ ఇంటర్మీడియట్ కాలేజీలో బైపీసీ పూర్తి చేసి, గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ చదువును పూర్తి చేశారు. కష్టపడి చదివి డాక్టర్గా పట్టా పొందడంతో ఆమె కుటుంబం, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
కాన్వకేషన్లో డాక్టర్ పట్టా అందుకున్న ప్రజ్ఞా వర్ధిని తన విజయానికి తల్లిదండ్రులు, గురువులు అందించిన ప్రోత్సాహమే కారణమని తెలిపారు. చిన్నతనం నుంచే తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామస్థులు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. నాణ్యమైన వైద్యం ద్వారా ప్రజల నమ్మకం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తంగా పేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి డాక్టర్గా ఎదిగిన ఈరని ప్రజ్ఞా వర్ధిని యువతకు ప్రేరణగా నిలిచారు.
Fetching videos...
Fetching latest news...
No trending news