ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, నిధుల అంశాలపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం చంద్రబాబు, ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమై రాష్ట్రంలోని సాగునీటి, జలవనరుల ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం, ఆ తర్వాత సీఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొంటారు. పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల అంశాలపై అక్కడ చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్తో కూడా సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాలిక ప్రణాళికలపై ఈ భేటీల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు, రేపు అక్కడి నుంచి అస్సాంకు వెళ్లనున్నారు. అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news