మన సంప్రదాయ వంటింట్లో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో రకాల పొడులు, పచ్చళ్లు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. వాటిలో నల్ల నువ్వులతో తయారు చేసే కారంపొడి ఒకటి. ఈ పొడి రుచికే కాదు, శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించడంలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నల్ల నువ్వుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఎముకల ఆరో్యగ్యానికి తోడ్పడతాయి. నడుమునొప్పి, కీళ్ల బలహీనత వంటి సమస్యలతో బాధపడే పెద్దవారు తమ ఆహారంలో ఈ పొడిని చేర్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వేడి వేడి అన్నంలో రెండు స్పూన్ల నల్ల నువ్వుల కారంపొడిని కొద్దిగా నెయ్యితో కలిపి తింటే రుచిగా ఉండటంతో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే ఇడ్లీ, దోశ, రాగి సంగటి, జొన్న రొట్టెలతో కూడా ఈ పొడి అద్భుతంగా సరిపోతుంది. ఈ పొడి తయారీలో ఉపయోగించే మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు వంటి పదార్థాలు రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తయారీ కోసం నల్ల నువ్వులు, పప్పులు, మసాలా దినుసులను విడివిడిగా వేయించి చల్లారిన తరువాత మిక్సీలో పొడిగా చేసుకోవాలి. చివరగా ఉప్పు, చింతపండు కలిపి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేస్తే రుచికరమైన నల్ల నువ్వుల కారంపొడి సిద్ధమవుతుంది. అయితే ఎముకలు విరిగినప్పుడు లేదా నడుమునొప్పి వంటి ఆరోగ్య సమస్యలకు ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, పోషకాహారంలో భాగంగా మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news