తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దేశ రాజకీయాల్లో అత్యంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉందని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ప్రశంసించారు. ఆయన చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒంటిమిట్ట హరిత హోటల్లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కొమరా వెంకట నరసయ్య మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు భారత రాజకీయాల్లో ఒక దార్శనిక నాయకుడిగా, అభివృద్ధి దిశలో కొత్త ట్రెండ్ సృష్టించిన వ్యక్తిగా నిలిచారని అన్నారు. ఆయన చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు మార్గదర్శకంగా మారాయని వివరించారు. అమలయ్యే వాగ్దానాలు చేసి వాటిని కచ్చితంగా నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో పారదర్శకత, వేగవంతమైన అభివృద్ధి, సాంకేతిక ఆధారిత పాలన వంటి అంశాలు రాష్ట్ర అభివృద్ధిని కొత్త దిశలో తీసుకెళ్లాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం సూపర్ సోనిక్ జెట్ వేగంతో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ, అమలు కాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన రాజకీయ శైలితో వారు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. తప్పుడు ఆరోపణలతో టిడిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాల ముందు ఆ విమర్శలు నిలబడలేకపోయాయని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా లాభం చేకూర్చుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కారణంగా భవిష్యత్తులో కూడా టిడిపి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
చివరగా, చంద్రబాబు నాయుడు ప్రజల అభివృద్ధి కోసం ఇంకా మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కొమరా వెంకట నరసయ్య ఆకాంక్షించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news