తిరుపతి నియోజకవర్గం 49వ డివిజన్లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా “రెండేళ్ల నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి” ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షురాలు పూరీమీట్ల రాణి ఆధ్వర్యంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విజయాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రభుత్వ పనితీరును ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వివరించారు.
ఈ కార్యక్రమంలో కో-యూనిట్ ఇంచార్జి లక్ష్మీదేవి, 221వ బూత్ కన్వీనర్ జ్యోతి, 211వ బూత్ కన్వీనర్ లలితతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news